Hero Motocorp: టూవీలర్‌ కొనుగోలుదారులకు షాకింగ్‌ న్యూస్‌..!

12 Apr, 2022 11:36 IST|Sakshi

ప్రముఖ టూవీలర్‌ ఆటోమొబైల్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు బైక్స్‌ ధరలను  భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ధరల పెంపు ఉండనుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ , హెచ్‌ఎఫ్ డీలక్స్ , గ్లామర్ , సూపర్ స్ప్లెండర్ , ఎక్స్‌పల్స్ 200 , ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ , ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ , హెచ్‌ఎఫ్ 100  బైక్స్‌ ధరలు భారీగా పెరిగాయి. హీరో ఎక్స్‌ పల్స్‌ 200టీ, హీరో స్ప్లెండర్ iSmart, హీరో X పల్స్ 200 స్టాండర్డ్‌ వేరియంట్‌, హీరో ప్యాషన్ ప్రో బైక్‌ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. 

వివిధ బైక్స్‌పై పెరిగిన ధరల జాబితా ఇదే..

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సింగిల్ డిస్క్ వేరియంట్‌ ధర రూ. 500 మేర(రూ. 1,12,110), స్టెల్త్‌ ఎడిషన్‌ వేరియంట్‌ ధర రూ. 1000(రూ. 1,17,660) వరకు పెరిగింది. 

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ స్టాండర్డ్‌ ఎడిషన్‌ బైక్‌పై రూ. 2000 పెరగగా...ఈ బైక్‌ ఇప్పుడు  రూ. 1,30,614కు రానుంది. 

 హీరో HF 100 స్టాండర్డ్‌ ఎడిషన్‌పై రూ. 420 మేర పెరిగింది. 

 ఆయా వేరియంట్లను బట్టి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ ధర రూ. 790 నుంచి రూ. 1,910 మేర పెరిగాయి. 

 హీరో HF డీలక్స్ బైక్‌ ఆయా వేరియంట్లపై   రూ. 750 నుంచి రూ. 1,420 మేర పెరిగాయి.  

 హీరో గ్లామర్ బైక్‌ ధరలు రూ. 600 నుంచి రూ. 1, 800 వరకు పెరిగాయి.

 హీరో సూపర్ స్ప్లెండర్ డ్రమ్‌ వేరియంట్‌ బైక్‌పై రూ. 1,500 మేర, డిస్క్‌ వేరియంట్‌పై రూ. 2000 మేర పెరిగాయి. 

 హీరో X పల్స్ 200 4వీ వేరియంట్‌ ధర రూ. 2, 200 వరకు పెరిగింది. 

చదవండి: చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాన్ని లాంచ్‌ చేయనున్న ఎంజీ మోటార్స్‌..! ధర ఎంతంటే..?

మరిన్ని వార్తలు