హీరో వాహనాలు మరింత ప్రియం

30 Mar, 2022 03:52 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ మోటార్‌సైకిల్స్, స్కూటర్స్‌ ధర పెంచుతోంది. మోడల్‌నుబట్టి  రూ.2,000 వరకు ఈ పెంపు ఉంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 5 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు వ్యయాలు అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు