హెచ్‌యూఎల్‌  సీఎండీగా రోహిత్‌ జావా

11 Mar, 2023 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) నూతన ఎండీ, సీఈవోగా రోహిత్‌ జావా నియమితులయ్యారు. దశాబ్ద కాలంపాటు నాయకత్వం వహించి పదవీ విరమణ చెందుతున్న సంజీవ్‌ మెహతా స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం లండన్‌లో యూనిలీవర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చీఫ్‌గా జావా ఉన్నారు. అయిదేళ్ల కాలానికిగాను ఎండీ, సీఈవోగా 2023 జూన్‌ 27న బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 1న కంపెనీ శాశ్వత డైరెక్టర్‌గా హెచ్‌యూఎల్‌ బోర్డులో చేరనున్నారు. యూనిలీవర్‌ సౌత్‌ ఏషియా ప్రెసిడెంట్‌గానూ ఆశీనులు కానున్నారు. 

ఇదీ  చదవండి: ఇన్ఫోసిస్‌కి షాకిచ్చిన టెక్‌ఎం కొత్త సీఎండీ, రోజు సంపాదన ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు