Diwali 2022: పండగ వేళ మీ డ్రీమ్‌ హౌస్‌కి ​ఎకో-ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌ కాంతులు

22 Oct, 2022 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్‌ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్‌ రావాలంటే ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ రెండు చోట్లా డెకరేటివ్‌ చేస్తే ఎకో-ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు. 
 సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్‌ లేదా మార్బుల్‌ పళ్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్‌ ధరల్లో వినూత్న డిజైన్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్‌ దీపాంతలు కూడా లభ్యమవుతాయి.

♦ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్‌ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.  వైర్‌లెస్‌ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు.  ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్‌ ఎంట్రెన్స్‌ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్‌ వంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్‌ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

 రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. 

 మట్టి దీపాంతలు, లాంతర్లకు బదులు అకార్డియన్‌ పేపర్‌ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశ్మిని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి

మరిన్ని వార్తలు