Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్​లెస్​ కార్!

11 Jun, 2021 18:32 IST|Sakshi

షెంజెన్​​: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్​ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా..  డ్రైవర్ లెస్​ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్​లెస్​ కార్లను మార్కెట్​లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది.

కాగా, చైనీస్​ మల్టీనేషనల్​ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్​ టెక్నాలజీస్ ఆటోమోటివ్​ స్పేస్​లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్​లెస్​ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్​క్వింగ్​ ఛాంగన్​ ఆటోమొబైల్​ కో లిమిటెడ్​తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్​ వెహికిల్స్​ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్​ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్​ కంపెనీగా పేరున్న హువాయ్​.. స్మార్ట్​ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్​ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్​తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్​ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్​తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగం​లోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్​.. 54 శాతం భారీ తగ్గింపు

మరిన్ని వార్తలు