ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్

18 Feb, 2023 07:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్‌ కుక్‌ బ్రాండ్‌లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ డీల్‌ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్‌ బ్రాండ్స్‌ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థ.   

మరిన్ని వార్తలు