టెక్నాలజీపై పట్టు, బ్యాంకింగ్‌ వ్యవస్థపై అవగాహన ఉంటే.. రూ.5 లక్షలు మీవే!

18 Aug, 2022 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకింగ్‌ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్‌ మద్దతు, వెల్స్‌ ఫార్గో భాగస్వామ్యంతో ‘అకడమిక్‌ గ్రాండ్‌ చాలెంజ్‌’ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఏఐ మిషన్‌ (టీ ఎయిమ్‌) బుధవారం ప్రకటించింది. ఈ చాలెంజ్‌లో భాగంగా దేశంలోని విద్యా­ర్థి బృందాలు రెండు కోణాల్లో పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది. పూర్తిగా భవిష్యత్‌ బ్యాంకింగ్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచైనా లావాదేవీలు నిర్వ­హించేలా ఆధునిక టెక్నాలజీల సమ్మిళితంగా నూతన ఆవిష్కరణ చేయా­లి.

దీంతో పాటు ఏడాది కాలంలో ఫైనాన్షి­యల్‌ మార్కెట్ల పనితీరును అంచనా వేసే విశ్లేషణాత్మక నమూనాను రూపొందించడం కూడా ఈ చాలెంజ్‌లో భాగంగా ఉంటుంది. విజేతగా నిలిచిన విద్యార్థి బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతితో పాటు పలు ప్రోత్సా­హకాలు కూడా ఉంటాయి. బ్యాంకింగ్‌ రంగంతోపాటు వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంలో ఇలాంటి చాలెంజ్‌లు తోడ్ప­డతాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థి బృందాలు సెప్టెంబర్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, విజేతలను ఈ ఏడాది నవంబర్‌లో ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీ–ఎయిమ్‌ వర్గాలు వెల్లడించారు.

చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్‌ కేసు: ఆరుగురు అరెస్ట్‌

మరిన్ని వార్తలు