భారత్ కు మరో అరుదైన గౌరవం, హ‌ర్షం వ్య‌క్తం చేసిన నీతా అంబానీ!!

19 Feb, 2022 16:31 IST|Sakshi

40 ఏళ్ల త‌ర్వాత భారత్కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ముంబాయిలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2023 సెషన్ ను నిర్వహించేందుకు భారత్ హక్కుల దక్కించుకుంది. ఈ సెషన్ ను 1863లో ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ వచ్చే ఏడాది ముంబైలో సెష‌న్ నిర్వ‌హించ‌డంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత భార‌త్‌లో సెష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అరుదైన గౌర‌వాన్ని భార‌త్‌కు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞత‌లు తెలిపారు. అంతేకాదు ఈ గౌర‌వం భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు గణనీయమైన అభివృద్ధికి సంకేత‌మ‌నీ నీతా అంబానీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మరిన్ని వార్తలు