దేశంలో రిటైల్‌ జోరు: కోవిడ్‌ ముం‍దుకంటే మెరుగ్గా

18 Aug, 2022 10:34 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారాలు కోవిడ్‌ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్‌ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది.

దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్‌నెస్, వ్యక్తిగత సంరక్షణ 3%  పెరిగాయి. పండుగల సీజన్‌లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్‌ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి.    

మరిన్ని వార్తలు