స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు..!

13 Jan, 2022 10:46 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు, వెంటాడుతున్న కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి. 

ఉదయం పదిన్నర గంటలకు బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 13.43 పాయింట్ల నష్టపోయి 61,136.61 పాయింట్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ మాత్రం 3.85 పాయింట్ల లాభంతో 18,216.20 వద్ద కొనసాగుతోంది. లాభనష్టాల్లోనివి.. సన్ ఫార్మా, కోల్ ఇండియా​, టాటా స్టీల్​, జెఎస్డబ్ల్యు స్టీల్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టాటా మోటార్స్​, యాక్సిస్ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

(చదవండి: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!)

మరిన్ని వార్తలు