ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌

30 Jun, 2022 11:33 IST|Sakshi

ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.  

మరిన్ని వార్తలు