-

భారత సంప్రదాయ ఔషధాలపై అంతర్జాతీయ సదస్సు..

2 Aug, 2022 06:30 IST|Sakshi

హరిద్వార్‌: పతంజలి రిసెర్చ్‌ ఫౌండేషన్‌ అండ్‌ పతంజలి యూనివర్సిటీ హరిద్వార్‌లో ‘భారతీయ సంప్రదాయ ఔషధాలు: ఆధునికీకరణ’ అన్న అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది.

సొసైటీ ఫర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ప్లాంట్, న్యూఢిల్లీ అలాగే నాబార్డ్, డెహ్రాడూన్‌ భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సులో వైద్య రంగంలో నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆయుర్వేదంలో నిష్ణాతులు ఆచార్య శ్రీ బాలకృష్ణ జీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ఒక  ఆవిష్కరణ కార్యక్రమంలో యోగా గురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ తదితరులు.

మరిన్ని వార్తలు