బీ న్యూ మొబైల్స్ స్టోర్లలో
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బీ న్యూ మొబైల్స్ కస్టమర్ల కోసం ఐఫోన్ 14 సిరీస్ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఎండీ వై బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, యాపిల్ సంస్థ ప్రతినిధులు మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.
ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట
ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కొనుగోలుపై 25శాతం కచ్చితమైన బైబ్యాక్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ను పొందవచ్చు.‘‘తెలుగు రాష్ట్రాల్లోని 150 అవుట్లెట్లలో ఈ మోడళ్లు లభ్యమవుతాయి. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని సంస్థ సీఎండీ వై.బాలాజీ తెలిపారు. (Instagram: కొత్త టూల్ వచ్చేసింది..చూశారా మీరు?)