వేగవంతమైన నెట్ సర్వీస్ కోసం.. జియో కొత్త ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌!

28 Mar, 2023 07:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిక్సిడ్‌ బ్రాడ్‌బాండ్‌ సెగ్మెంట్‌లో పోటీని మరింత వేడెక్కిస్తూ జియో కొత్తగా ఎంట్రీ లెవెల్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.198 ధరతో బ్రాడ్‌బాండ్‌ బ్యాకప్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనితో సెకనుకు 10 మెగాబిట్‌ వేగంతో నెట్‌ సర్వీసులు అందుకోవచ్చు. రూ. 21 - 152 వరకు చెల్లించడం ద్వారా 1 - 7 రోజుల పాటు ఇంటర్నెట్‌ వేగాన్ని 30 ఎంబీపీఎస్‌ లేదా 100 ఎంబీపీఎస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 5 నెలల పాటు యూసేజీ, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు కలిపి కొత్త కస్టమరు రూ.1,490 కట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు కనీస ప్లాన్‌ నెలకు రూ.399గా ఉంది.

మరిన్ని వార్తలు