Jio offer: జియో అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్‌!

1 Apr, 2023 07:38 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో తాజాగా అపరిమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.599 నెలవారీ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు ఉచిత కాల్స్, అపరిమిత 4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందుకోవచ్చు.

(వంట గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!)

జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌తోసహా మరిన్ని యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అర్హత కలిగిన వినియోగదార్లకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ప్రీపెయిడ్‌ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి, కొత్త కస్టమర్లకు జియో 30 రోజుల ఉచిత ట్రయల్‌ని ఆఫర్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు