Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! 20 శాతం క్యాష్‌బ్యాక్‌..! ఎలా పొందాలంటే..!

4 Dec, 2021 17:07 IST|Sakshi

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ రేట్లను పెంచడంతో జియో కూడా తన యూజర్లకు షాకిస్తూ టారిఫ్‌ ప్లాన్లను ధరలను పెంచింది. కాగా పెరిగిన ధరల నుంచి ఉపశమనం ఇస్తూ ..పలు ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను జియో అందిస్తోంది.  

20 శాతం క్యాష్‌బ్యాక్‌..!
రిలయన్స్ జియో తన మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ రీఛార్జీపై  20 శాతం జియోమార్ట్‌ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రూ.719, రూ.666, రూ. 299 ప్లాన్లతో రీఛార్జ్‌ చేసుకుంటే 20 శాతం సుమారు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు సొంతం చేసుకోవచ్చును. అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్‌లు , జియో మార్ట్‌, ఆజియో, రిలయన్స్‌ ట్రెండ్స్‌, నెట్‌మెండ్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌లో ఈ క్యాష్‌బ్యాక్‌ను వాడవచ్చును. ఒక కస్టమర్ ప్రతి రోజు రూ.200 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. 

క్యాష్‌బ్యాక్‌ ఎలా వస్తోందంటే..!
ఆయా ప్లాన్లను రీఛార్జ్‌ చేసిన మూడు రోజులలోపు వినియోగదారుల ఖాతాకు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది.  ఈ క్యాష్‌బ్యాక్‌ను వివిధ రిలయన్స్ రిటైల్ ఛానెళ్ల నుంచి రీడీమ్ చేసుకోవచ్చను. 
చదవండి: 15 నిమిషాల్లోనే సరుకులు డోర్ డెలివరీ: స్విగ్గీ

మరిన్ని వార్తలు