2 లక్షల కార్ల సేల్‌, ఎక్కువగా అమ్ముడైన కార్‌ ఇదే

21 Aug, 2021 09:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ కియా భారత్‌లో రెండు లక్షల సెల్టోస్‌ కార్లను విక్రయించినట్టు ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కనెక్టెడ్‌ కార్లను అమ్మినట్టు వివరించింది.

ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల పైచిలుకు కార్లు దేశంలోని కస్టమర్లకు చేరాయని తెలిపింది. సెల్టోస్‌ ఎస్‌యూవీ అమ్మకాల్లో టాప్‌ వేరియంట్ల వాటా 58%, ఆటోమేటిక్‌ ఆప్షన్‌ 35% ఉంది. డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ 45% వాటా కైవసం చేసుకుంది. 

మరిన్ని వార్తలు