జనాలు ఈ 'టీవీ' బ్రాండ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు

31 Jul, 2021 07:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా 2021 సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ నిలిచింది. ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ ఈ మేరకు జాబితా విడుదల చేసింది. 2019తోపాటు 2020 సంవత్సరంలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీ అవార్డు దక్కించుకుంది.

వరుసగా మూడు సంవత్సరాలపాటు ఉన్నత గౌరవాన్ని పొందడం భారతీయ మార్కెట్‌ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ హక్‌ హ్యున్‌ కిమ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు