మరోమైలు రాయిని చేరిన ఎల్‌ఐసీ

24 Jun, 2021 07:34 IST|Sakshi

హైదరాబాద్‌: బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ మరో మైలురాయిని చేరుకుంది. నూతనంగా రూపొందించిన కేంద్రీకృత ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ–పీజీఎస్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ ముంబైలోని కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఎండీ విపిన్‌ ఆనంద్‌ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ప్లాట్‌ఫామ్‌ నుంచి జారీ అయిన మొదటి రసీదును ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేవశ్‌ శర్మకు ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ అందించారు. కేంద్రకృత వసూళ్లు, చెల్లింపుల కోసం ఈ నూతన ప్లాట్‌ఫామ్‌ను ఎల్‌ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.   

చదవండి: ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం

మరిన్ని వార్తలు