మిస్డ్‌ కాల్‌తో ఇండేన్‌ ఎల్పీజీ బుకింగ్‌

2 Jan, 2021 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కేవలం ఫోన్‌ మిస్డ్‌ కాల్‌తోనే ఎల్పీజీ రీఫిల్‌ బుకింగ్‌ సదుపాయం ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ అవుతుందని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఫోన్‌ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్‌ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్‌ఎస్‌ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. (చదవండి: కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?)

మరిన్ని వార్తలు