ఎల్‌అండ్‌టీ నుంచి భారీ డివిడెండ్‌?

24 Oct, 2020 16:07 IST|Sakshi

బుధవారం(28న) బోర్డు సమావేశం

ప్రత్యేక డివిడెండ్‌తోపాటు, క్యూ2 ఫలితాల విడుదల

డివిడెండ్‌ చెల్లింపునకు రికార్డ్‌ డేట్‌- నవంబర్‌ 5

ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్‌) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్‌ 5 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్‌అండ్‌టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్‌, ఆటోమేషన్‌ బిజినెస్‌ను ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్‌ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు