‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు

19 May, 2022 11:46 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ఫోక్స్‌ వ్యాగన్‌ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సం‍స్థల మధ్య ఒప్పందం కుదిరింది. 

భవిష్యత్తులో మహీంద్రా గ్రూపు తయారు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఫోక్స్‌ వ్యాగన్‌ సమకూరుస్తుంది. మోటార్‌, ఇతర ఎలక్ట్రిక్‌ కాంపోనెంట్స్‌ను ఎంఈబీ సంస్థ అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అగ్రిమెంట్‌ చేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
 

మరిన్ని వార్తలు