పాత కార్ల అమ్మకాల్లో మహీంద్రా జోరు

28 Aug, 2021 09:40 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పాత కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ వీల్స్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం 75 ఫ్రాంచైజీ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో సంస్థ స్టోర్ల సంఖ్య 1,100 దాటింది.

ఈ ఔట్‌లెట్లలో  సర్టిఫైడ్‌ యూజ్డ్‌ కార్ల అమ్మకం, రుణ సౌకర్యం వంటి సేవలు పొందవచ్చు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ పాత కార్లకు డిమాండ్‌ భారీగా ఉందని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అశుతోశ్‌ పాండే తెలిపారు

మరిన్ని వార్తలు