మహీంద్రా ఎక్స్‌యూవీ700 @ రూ.11.99 లక్షలు

16 Aug, 2021 02:54 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, పెట్రోల్‌ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్‌ ఆప్షన్స్‌తో 5, 7 సీట్ల సామర్థ్యంతో వాహనాన్ని రూపొందించారు.

వేరియంట్‌నుబట్టి స్మార్ట్‌ డోర్‌ హ్యాండిల్స్, స్కైరూఫ్, కర్టెయిన్‌ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్‌ డ్రౌజినెస్‌ అలర్ట్, స్మార్ట్‌ క్లీన్‌ జోన్, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్, సైడ్‌ ఎయిర్‌బ్యాగ్స్, మెమరీతో 6–వే పవర్‌ సీట్, సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్స్, బ్లైండ్‌ వ్యూ మానిటరింగ్, ఎల్రక్టానిక్‌ పార్క్‌ బ్రేక్, వైర్‌లెస్‌ చార్జింగ్, 360 సరౌండ్‌ వ్యూ వంటి హంగులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు