రికార్డుల ర్యాలీకి చెక్‌-  ఐటీ అప్‌

5 Jan, 2021 10:12 IST|Sakshi

141 పాయింట్లు మైనస్‌‌- 48,036కు చేరిన సెన్సెక్స్‌

53 పాయింట్లు తగ్గి 14,080 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

మెటల్‌, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.2 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: చిట్టచివరికి  9 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 141 పాయింట్లు క్షీణించి 48,036కు చేరింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు తక్కువగా 14,080 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్‌ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,130-47,903 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 14,116-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

మీడియా, రియల్టీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌‌, ఆటో 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మీడియా, ఐటీ 0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, విప్రో మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ, బజాజ్‌ ఆటో, బీసీసీఎల్‌ 3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎంజీఎల్‌ జోరు
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఎంజీఎల్‌, ఐజీఎల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్‌, మదర్‌సన్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, జీ, నౌకరీ, ఇండస్‌టవర్‌ 4.2- 1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్‌, ఇండిగో, చోళమండలం, కెనరా బ్యాంక్‌, భారత్‌ ఫోర్జ్‌, ఐడియా, ఆర్తి ఇండస్ట్రీస్‌, లాల్‌పాథ్‌ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్స్‌ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,229 నష్టపోగా.. 1149 లాభాలతో ట్రేడవుతున్నాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు