Maruti Car Prices Hike: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..!

19 Apr, 2022 07:39 IST|Sakshi

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అన్ని రకాల మోడళ్ల ధరలను సవరించింది. మోడల్‌నుబట్టి 0.9–1.9 శాతం మేర ధర పెంచినట్టు కంపెనీ ప్రకటించింది. సోమవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయని వివరించింది.

తయారీ వ్యయం అధికం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 2021 జనవరి నుంచి 2022 మార్చి మధ్య వాహన ధరలను మారుతీ సుజుకీ 8.8 శాతం పెంచింది.  స్టీల్, రాగి, అల్యూమినియం, ఇతర విలువైన లోహాలు రోజురోజుకూ ఖరీదు అవుతూనే ఉన్నాయి.   

చదవండి: గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనున్న ఎల్‌ఎంఎల్‌..! అది కూడా ఎలక్ట్రిక్‌ హైపర్‌ బైక్‌..!

మరిన్ని వార్తలు