న్యూగ్రాండ్‌ విటారా ఎక్స్‌పీరియన్స్‌ డ్రైవ్‌: థ్రిల్‌ అయిన కస్టమర్లు

17 Mar, 2023 10:59 IST|Sakshi

హైదరాబాద్‌: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్‌యూవీ ఆల్‌ న్యూ గ్రాండ్‌ విటారాతో ‘‘ఎక్స్‌పీరియన్స్‌ డ్రైవ్‌’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్‌ న్యూ గ్రాండ్‌ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్‌లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 

సుజుకీ పేటెంట్‌ కలిగి ఆల్‌గ్రిప్‌ సెలెక్ట్‌ ట్రిమ్‌ ధర రూ.16.89 లక్షలు ఉంది.  ఈ ఎక్స్‌పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు  సుమారు 100 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ  వెల్లడించింది. ఈ వేరియంట్‌ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు