Mercedes Benz: రూ. 2.55 కోట్ల మెర్సిడెస్‌ జీ–క్లాస్‌ - పూర్తి వివరాలు

9 Jun, 2023 07:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్‌లో జీ–క్లాస్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్‌ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్‌ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. 

ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్‌–డిసెంబర్‌లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది.

మరిన్ని వార్తలు