సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: ప్యాకేజింగ్ సొల్యూషన్ల కంపెనీ మిత్సు కెమ్ ప్లాస్ట్ ఐపీవో బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 125 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
ఐపీవోలో భాగంగా పూర్తిగా కొత్త ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్లో వినియోగించే పాలిమర్ ఆధారిత మోల్డెడ్ ప్రొడక్టులను తయారు చేస్తోంది.