ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటరోలా సరికొత్త మోటో జీ పవర్ 2022 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్గ్రేడ్గా రానుంది. 50-మెగాపిక్సెల్ సెన్సార్తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటుచేసింది. ఈ స్మార్ట్ఫోన్స్ ధరలు సుమారు రూ. 14 వేల నుంచి 18 వేల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ యూఎస్ మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లలోకి వచ్చే ఏడాదిలో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11తో పనిచేయనుంది.
మోటో జీ పవర్ స్పెసిఫికేషన్స్