-

Motorola:మోటో ట్యాబ్‌ జి20, ట్యాబ్లెట్‌ మార్కెట్లోకి మోటరోలా ఎంట్రీ

2 Oct, 2021 12:34 IST|Sakshi

మోటరోలా ట్యాబ్లెట్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. మోటో ట్యాబ్‌ జి20ను విడుదల చేసింది. 8 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో, టీడీడీఐ టెక్నాలజీతో మెరుగైన టచ్‌ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో కూడిన ట్యాబ్లెట్‌లో మీడియా టెక్‌ హీలియో పీ22టీ ఆక్టాకోర్‌ ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది.

ఈనెల 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై బుక్‌ చేసుకోవచ్చని.. ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌ కా ర్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

మరిన్ని వార్తలు