ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచనలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కీలకమైన సూచనలు చేసింది. ఫేమ్-2 పథకం కింద ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై (ఈవీ) ఇస్తున్న సబ్సిడీకి అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. ప్రాధాన్యరంగ రుణ వితరణ విభాగంగా ఈవీలను గుర్తించడంతోపాటు.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని ఇవ్వాలని కోరింది. వీటికి అదనంగా.. ఈవీల కోసం ప్రత్యేక లేన్లు.. వాణిజ్య సముదాయల వద్ద ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కల్పించాలని కూడా సూచించడం గమనార్హం. ప్రస్తుతం వాహన విక్రయాల్లో పర్యావరణ అనుకూల ఈవీ, తక్కువ కార్బన్ను విడుదల చేసే వాహనాల వాటా 1 శాతంలోపే ఉంది.
ఇతర సూచనలు..