అసత్య ప్రచారం.. క్రిప్టోలో ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌ చేయలేదు

20 Nov, 2021 14:42 IST|Sakshi

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్‌ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.  

అంతేకాదు ఆనంద్‌ మహీంద్రా క్రిప్టోలో పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన కథనాల్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కథనాలన్నీ అవాస్తవం. ఈ వార్తలపై పలువురు తనని అప్రమత్తం చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు. 

చదవండి: ఎంత మంచి పని ! ఈ స్టార్టప్‌కి నేను అండగా ఉంటా - ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు