భారీగా పెరిగిన మొబైల్‌ మాల్వేర్‌ దాడులు

15 Apr, 2021 08:06 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్‌ ఫోన్లపై మాల్వేర్‌ దాడులు పెరిగినట్టు సైబర్‌ భద్రతా సంస్థ చెక్‌ పాయింట్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. 2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్‌ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్‌ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్‌ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్‌ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు తెలిపింది.  

>
మరిన్ని వార్తలు