న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. తొలుత నేపాల్లో ప్రవేశిస్తోంది. ఇందుకోసం సీజీ మోటార్స్తో పంపిణీ ఒప్పందం చేసుకుంది. వచ్చే త్రైమాసికం నుంచే ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. రెండవ దశలో లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరోపియన్ యూ నియన్కు విస్తరించనున్నట్టు వెల్లడించింది.
చదవండి : బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్