ఒలెక్ట్రాకే 50 ఎలక్ట్రిక్‌ బస్‌ల సరఫరా ఆర్డర్‌

17 Aug, 2021 07:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా 50 ఎలక్ట్రిక్‌ బస్‌ల సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. గుజరాత్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (జీఎస్‌ఆర్‌టీసీ) నుంచి ఈ ఆర్డర్‌ దక్కింది. ఇందులో భాగంగా 10 ఏళ్ల కాలానికిగాను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో బస్‌లను 12 నెలల్లో జీఎస్‌ఆర్‌టీసీకి అందజేస్తారు.

మొత్తం ఆర్డర్‌ బుక్‌ 1,350 బస్‌లకు చేరుకుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ కె.వి.ప్రదీప్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌ రాష్ట్రంలో ఒలెక్ట్రా తయారీ 200 ఈ–బస్‌లు పరుగెడుతున్నాయని చెప్పారు. 9 మీటర్ల పొడవున్న ఈ బస్‌లో డ్రైవర్‌తో కలిపి 34 మంది కూర్చోవచ్చు. ఇందులోని లిథియం అయాన్‌ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌ చేస్తే బస్‌ 180–200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3–4 గంటల్లోనే చార్జింగ్‌ పూర్తి కావడం విశేషం.

చదవండి రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్‌ డాలర్లు దాటిన భారత్‌ పెట్టుబడులు

మరిన్ని వార్తలు