ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్‌

3 Sep, 2022 06:07 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్‌ అందుకుంది.  అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ స్వీకరించింది. డీల్‌ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్‌ ఈ సందర్భంగా తెలిపారు.

కంపెనీ తయారీ ఎలక్ట్రిక్‌ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్‌.  తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రమోట్‌ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్‌ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను  సమీకరించడానికి బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. 

మరిన్ని వార్తలు