ఒమిక్రాన్‌ భయం.. ట్రావెల్‌ బ్యాన్‌, ఎంసీ12 భేటీ వాయిదా

27 Nov, 2021 16:06 IST|Sakshi

ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది.  బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్‌లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్‌ మొండి వేరియంట్‌ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. 

వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్‌(ఎంసీ12) కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది.  అయితే కొత్త వేరియెంట్‌ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్స్‌ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు.

ఇక నవంబర్‌ 30 డిసెంబర్‌ 3 మధ్య  వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఎంసీ12 సమావేశం  జరగాల్సి ఉంది. అయితే స్విస్‌ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్‌ బ్యాన్‌ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్‌, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO.  ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి.

చదవండి: ఆ మార్కెట్‌లో మళ్లీ కరోనా కలకలం 

>
మరిన్ని వార్తలు