జియో యూజర్లకు బంపరాఫర్‌!

12 Dec, 2022 15:55 IST|Sakshi

ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ ప్లస్‌ సంస్థ దేశీయ టెలికం దిగ్గజం జియోతో చేతులు కలిపింది. దేశలో వేగంగా 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. 

భారత్‌లో వన్‌ ప్లస్‌ - జియోలు లేటెస్ట్‌ 5జీ టెక్నాలజీ  నెట్‌వర్క్‌ పై పనిచేలా ఒప్పందం కుదుర‍్చుకున్నాయి. ఇందులో భాగంగా జియో సంస్థ వన్‌ ప్లస్‌కు చెందిన వన్‌ ప్లస్‌ 9 ప్రో, వన్‌ ప్లస్‌ 9, వన్‌ ప్లస్‌ 9 ఆర్‌టీ’తో పాటు వన్‌ ప్లస్‌ 10 ప్లస్‌, వన్‌ ప్లస్‌ 9 ఆర్‌, వన్‌ ప్లస్‌ 8 సిరీస్‌లోని నార్డ్‌, నార్డ్‌ 2టీ, నార్డ్‌ 2, నార్డ్‌ సీఈ, నార్డ్‌ సీఈ2, నార్డ్‌ సీఈ 2 లైట్‌ ఫోన్‌లలో జియో 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నాయి. 

ఈ తరుణంలో డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 18 వరకు వన్‌ప్లస్‌ యానివర్సరీ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌లో అర్హులైన వన్‌ ప్లస్‌, జియో 5జీ వినియోగదారులకు రూ.10,800 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు