ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ 'వన్ప్లస్' ఇప్పుడు నార్డ్ సిరీస్'లో మరో మొబైల్ తీసుకొచ్చింది. ఈ మిడ్ రేంజ్ వన్ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్'ను, వన్ప్లస్ వై1ఎస్ సిరీస్ టీవీతో పాటు నేడు(ఫిబ్రవరి 17) మన దేశంలో లాంచ్ చేసింది. కంపెనీ గత ఏడాది లాంఛ్ చేసిన వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీకి వారసుడు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ తీసుకొచ్చారు. వన్ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే హెచ్డీఆర్+ సపోర్టు చేసే అమోలెడ్ డిస్ప్లే ఉంది.
నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ధర
మన దేశంలో వన్ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటే, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బహామా బ్లూ, గ్రే మిర్రర్ రంగులలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అమ్మకానికి వస్తుందని వన్ప్లస్ తెలిపింది.
నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ స్పెసిఫికేషన్స్
(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!)