ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు

18 Jan, 2021 12:57 IST|Sakshi

భారతదేశంలో ఒప్పో తన ఎ12 మోడల్ ధరను తగ్గించింది. ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎ15, ఒప్పో రెనో 3 ప్రోలతో పాటు ఒప్పో ఎ12ను జూన్‌లో భారత్‌లో విడుదల చేశారు. ఒప్పో ఎ12 మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెసర్ ని కలిగి ఉంది. కొత్త ధరల ప్రకారం భారతదేశంలో ఒప్పో ఎ 12 3జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధరను రూ.8,990 నుంచి రూ.8,490కు తగ్గించింది. అదే విదంగా 4 జీబీ ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ధర కూడా రూ.11490 నుంచి రూ.10,990కు ధర తగ్గించబడింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత)

ఒప్పో ఎ12 ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.22-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హెలియో పీ35
రియర్ కెమెరా: 13ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 05 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,320 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
 

మరిన్ని వార్తలు