Parle: బిస్కట్‌ ధరలు కూడా పెరిగాయ్‌

24 Nov, 2021 09:10 IST|Sakshi

Parle Products hikes : ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న పార్లే ప్రొడక్టŠస్‌ అన్ని విభాగాల్లో 5–10 శాతం ధరలు పెంచింది. చక్కెర, గోధుమలు, వంట నూనెల వ్యయం అధికం కావడం వల్లే ధరలు సవరించినట్టు కంపెనీ ప్రకటించింది. గోధుమలు, చక్కెర ధర గతేడాదితో పోలిస్తే 8–10 శాతం పెరిగిందని పార్లే ప్రొడక్టŠస్‌ సీనియర్‌ క్యాటగిరీ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు.

వీటిపైన
రూ.20 ఆపై ధర గల బిస్కట్స్, ఇతర ఉత్పత్తులు ప్రియం అయ్యాయి. రూ.20 లోపు ధర గల ఉత్పత్తుల బరువు తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చిలో సైతం కంపెనీ ఉత్పత్తుల ధరను పెంచింది.  
 

మరిన్ని వార్తలు