పేటీఎం యూజర్లకు శుభవార్త

25 Nov, 2020 17:01 IST|Sakshi

భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా రాణిస్తున్న పేటీఎం సంస్థ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఇఎంఐ)లో తిరిగి చెల్లించవచ్చని కంపెనీ ప్రకటించింది. దింతో వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్ ద్వారా మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు. అందుకోసం పేటీఎం మీ నుండి తక్కువ వడ్డీని వసూలు చేయనుంది. పేటీఎం ద్వారా ఇప్పుడే కొనండి మరియు తరువాత చెల్లించండి (బీ ఎన్ పీ ఏల్) అనే సౌకర్యం ఐదు లక్షలకు పైగా ఉత్పత్తులతో మరియు సేవలకు ఐదు లక్షలకు పైగా ప్లస్ షాపులు మరియు వెబ్‌సైట్లలో పొందవచ్చు అని తెలిపింది. (చదవండి: ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి)

కోవిడ్–19 మహమ్మారితో వినియోగదారుల ఆర్థిక లోటు పెరగడంతో ఈ సౌకర్యవంతమైన ఇఎంఐ చెల్లింపు విధానం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని పేటీఎం పేర్కొంది. కాగా, పేటీఎం ప్రస్తుతం రూ .1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐ రూపంలో సకాలంలో తిరిగి చెల్లిస్తే ఈ లిమిట్ ను మరింత పెంచుతామని పేటీఎం తెలిపింది. పోస్ట్ పెయిడ్ సేవలు లైట్, డిలైట్ మరియు ఎలైట్ అనే మూడు వేర్వేరు విభాగాలలో లభిస్తుంది. పోస్ట్‌పెయిడ్ లైట్ రూ. 20,000 వరకు డెలైట్, ఎలైట్ క్రెడిట్ పరిమితులను రూ. 1,00,000 నెలవారీ ఖర్చు విధించింది. వినియోగదారులు వారి ఖర్చులను తెలుసుకోవడానికి ప్రతి నెలా ఒకే బిల్లును అందిస్తారు. బిల్లు ఉత్పత్తి చేసిన మొదటి ఏడు రోజుల్లో వినియోగదారులు పోస్ట్‌పెయిడ్ బిల్లును సౌకర్యవంతమైన ఈఎంఐలుగా మార్చుకోవచ్చని డిజిటల్ చెల్లింపు సంస్థ పేటీఎం తెలిపింది. పోస్ట్‌పెయిడ్ బిల్లును యుపిఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్‌తో సహాయంతో తిరిగి చెల్లించవచ్చు .
 

>
మరిన్ని వార్తలు