మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

10 May, 2021 09:34 IST|Sakshi

లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంపు

సాక్షి, ముంబై :  దేశవ్యాప్తంగా  పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 34 పైసలు పెరిగింది.  దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరగా, డీజిల్ ధర రూ. 82.06 కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబైలో  పెట్రోల్, రూ .97.86,  డీజిల్‌ రూ .89.17
చెన్నై పెట్రోల్‌ రూ .93.38, డీజిల్‌  రూ .86.96
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ .91.66, డీజిల్‌ రూ.84.90

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47
విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43

చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ

>
మరిన్ని వార్తలు