Petrol Diesel Prices Hike: వరుసగా రెండో రోజు  పెట్రో బాదుడు

5 May, 2021 14:39 IST|Sakshi

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

సాక్షి, ముంబై :  దేశవ్యాప్తంగా  పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా  రెండో రోజు పెరిగాయి. కొంతకాలంగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు  మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.  తాజాగా లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగింది.  ఢిల్లీలో పెట్రోలుపై 30 పైసలు, డీజిల్ 21  చొప్పున  ధర పెరిగింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరగా, డీజిల్ ధర రూ. 80.91కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబైలో  పెట్రోల్, రూ .97.12,  డీజిల్‌ రూ .88.19 
చెన్నై పెట్రోల్‌ రూ .92.70, డీజిల్‌  రూ .86.09
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ .90.92, డీజిల్‌రూ .83.98

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 94.34.డీజిల్ ధర రూ.88.46
అమరావతిలో పెట్రోల్ ధర రూ. 96.90.డీజిల్ ధర రూ.90.50
విజయవాడలో పెట్రోల్ ధర రూ. 96.49 డీజిల్ ధర రూ.90.11

మరిన్ని వార్తలు