వినియోగదారులకు పీఎన్‌బీ షాక్‌, ఈఎంఐ మరింత భారం

1 Jun, 2022 13:12 IST|Sakshi

రుణాలపై వడ్డీరేట్లు  పెంచేసిన పీఎన్‌బీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన వినియోగదారులకు  షాక్‌ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు  లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల  టెన్యూర్స్‌పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది.  దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. 

సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్‌ ఆర్‌ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో  ఆర్‌బీఐ  రేటును పెంచిన తర్వాత ఈ  మార్పు చోటు చేసుకొంది.

మరిన్ని వార్తలు