రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా క‌న్నుప‌డింది!!వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు షురూ!

10 Feb, 2022 08:02 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా రియల్టీ రంగ కంపెనీ డీబీ రియల్టీలో ఇన్వెస్ట్‌ చేయనున్నారు. భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నారు.

 రుణరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు వీలుగా వారంట్ల జారీ ద్వారా రూ.1,575 కోట్లు సమీకరించనున్నట్లు డీబీ రియల్టీ వెల్లడించింది. ప్రమోటర్‌ గ్రూప్‌సహా ఇతర ఇన్వెస్టర్లకు దశలవారీగా ఈక్విటీ షేర్లుగా మార్పిడయ్యే 12.7 కోట్ల వారంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. 

రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇటీవలే డీబీ రియల్టీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే యోచనకు స్వస్తి నేపథ్యంలో రాకేష్‌ కుటుంబ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరిన్ని వార్తలు