ఇకపై పిల్లలకు ఆర్థిక పాఠాలు

15 Nov, 2022 09:28 IST|Sakshi

ఆర్‌బీఐ కార్యక్రమానికి రాష్ట్రాల ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఆర్‌బీఐ సూచించే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడానికి అంగీకరించాయి. ఆర్‌బీఐ, ఇతర నియంత్రణ సంస్థలు సంయుక్తంగా ఆర్థిక అక్షరాస్యత అంశాలను రూపొందించాయి.

దీంతో స్కూల్‌ పాఠ్యాంశాల్లో ప్రాథమిక ఆర్థిక అంశాలకు చోటు లభించనుంది. ‘‘పాఠశాల విద్యలో ఆర్థిక అక్షరాస్యతను మనం చేర్చితే, దేశంలో ఆర్థిక జ్ఞానం విస్తరించేందుకు తోడ్పడుతుంది. 610 తరగతుల పాఠాల్లో దీన్ని చేర్చనున్నట్లు’’ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ శర్మ అన్నారు.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు