ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం!
ఆర్బీఐ గవర్నర్ స్పష్టీకరణ
ధరల స్పీడ్ తగ్గుతుందని భరోసా
ద్రవ్యలోటు భర్తీకి కరెన్సీ ముద్రణ సరికాదని వివరణ
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ప్రజలు అందరినీ భాగస్వాములను చేయడం, ఈ సేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం (ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) విధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి మహమ్మారి కరోనా సవాళ్లు తొలగిపోయిన తర్వాత కూడా ఈ పాలసీకి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుందని దాస్ పేర్కొన్నారు. దేశ సుస్థిర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు ఇది ఎంతో కీలకమని కూడా ఒక ఇంటర్వూ్యలో గవర్నర్ స్పష్టం చేశారు. డిజిటల్ మీడియంసహా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం, లొసుగులు లేకుండా చర్యలు తీసుకోవడం, సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, తగిన విధానాలు అవగాహన ద్వారా ఫైనాన్షియల్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఎంతో కీలకమని అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో కీలక స్థానాల్లో ఉన్న వారి అందరికీ ఆయా విభాగాల్లో పురోగతి సాధించే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు.
త్వరలో ఇండెక్స్
గడచిన దశాబ్ద కాలంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్పై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి పెట్టిందని గవర్నర్ వివరించారు. బ్యాంకింగ్ సేవలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు దగ్గర చేసి, ఎకానమీలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి జరుగుతోందని అన్నారు. కేంద్రం ప్రారంభించిన ప్రధాని జన్ ధన్ యోజన పథకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఏ స్థాయిలో విస్తరిస్తోందన్న విషయాన్ని తెలుసుకోడా నికి నిర్మాణాత్మకంగా, కాలాలవారీగా ఫైనాన్షి యల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ (ఎఫ్ఐఐ)ను తీసుకురావాలన్న నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఆర్బీఐ ఈ సూచీని వెలువరిస్తుందన్నారు. మూడు అంశాలపై ఈ ఇండెక్స్ ప్రధానంగా దృష్టి పెడుతుం దని తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ విస్తరణ, వినియోగం, ఇందుకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు ఇందులో ఉంటాయని శక్తికాంద్ దాస్ వివరించారు.
ప్రభుత్వ సేవలకు భరోసా
మహమ్మారి కష్టాల సమయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందించడానికి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఎంతో దోహపడిందన్నారు. ప్రత్యేకించి ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు పథకాల ద్వారా నగదు చెల్లింపులను సకాలంలో జరగడానికి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో పురోగతే కారణమన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 54 మంత్రిత్వశాఖల పరిధిలో అమలవుతున్న దాదాపు 319 ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు రూ.5.53 లక్షల కోట్ల చెల్లింపులు డిజిటల్గా జరిగాయన్నారు. ప్రభుత్వ రుణ నిర్వహణలో కీలకమైన ఆర్బీఐ, ద్రవ్య విధానాలు వేగవంతమైన బదలాయింపులకు దోహదపడిందని, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ కొనసాగడానికి చర్యలు తీసుకుందని వివరించారు.
ఇంటర్వ్యూలో మరిన్ని ముఖ్యాంశాలు..