మహేశ్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ జరిమానా 

30 Jun, 2021 10:15 IST|Sakshi

ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సహకార బ్యాంకులకు జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఉంది. డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ విషయంలో నిబంధనలు పాటించని కారణంగా ఈ బ్యాంకునకు రూ.1.12 కోట్ల జరిమానా పడింది.

అహ్మదాబాద్‌ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌తోపాటు ముంబైకి చెందిన ఎస్‌వీసీ కో–ఆపరేటివ్‌ బ్యాంక్, సారస్వత్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌నకు సైతం రిజర్వ్‌ బ్యాంక్‌ జరిమానా విధించింది.    

చదవండి: Airtel: స్పేస్‌ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్‌

మరిన్ని వార్తలు